హనుమకొండ : పార్టీలు మారే చరిత్ర నాది కాదు. పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్(Aruri Ramesh) అన్నారు. హన్మకొండ ప్రశాంత్ నగర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 2012 లో ప్రజా రాజ్యం పార్టీ విలీనం తర్వాత ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
అప్పడి నుంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీకోసం అనేక కార్యక్రమాలు చేశానని పేర్కొన్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేని కొంతమంది నేను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గెలిచినా, ఓడినా నిరంతరం జిల్లాలో బీఅర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కష్ట పడుడుదామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాగేశ్వర రావు, సునీల్, రజిత,పాక్స్ చైర్మన్స్ వనం రెడ్డి, హరి కృష్ణ, హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు రజిని కుమార్, పాక్స్ వైస్ చైర్మన్ మల్లా రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్, వినోద్, వర్ధన్నపేట పట్టణ అధ్యక్షుడు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.