హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): తాను బీజేపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ ఖండించారు. తాను ఏ పార్టీలోనూ చేరటం లేదని స్పష్టంచేశారు. కేసీఆర్ నాయకత్వంలో తాను ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశానని తెలిపారు.
కొంతమంది ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నానని తెలిపారు. కేసీఆర్తో నాయకత్వంలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. ఇతర పార్టీల నేతలు తన గురించి చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని శంకర్ విజ్ఞప్తి చేశారు.