కాచిగూడ,డిసెంబర్ 26 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గౌడ కులస్తుల కోసం కోకాపేటలో 5 కోట్ల రూపాయలతో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో ప్రభుత్వం వెంటనే గౌడ భవనాన్ని నిర్ణించాలని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ (Srinivas Goud )అన్నారు. గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్(గోపా)ఆధ్వర్యంలో గోపా స్వర్ణోత్సవాలను కాచిగూడ మున్నూరుకాపు సంఘం మ్యాడం అంజయ్య హాల్లో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేకుమార్గౌడ్, శాషనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, జస్టిస్ ఈశ్వరయ్య హాజరయ్యారు.
అనంతరం శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు అర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వైన్ షాపులలో 10 శాతం రిజర్వేషన్లు కేటాయించామన్నారు. కులవృత్తి ఆత్మగౌరవం పెంపొందించడం కోసం ట్యాంక్ బండ్పై నీరా కేఫ్ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం వీటిని పట్టించుకోక పోవడంతో మరుగున పడుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మీసీ కమీషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్గౌడ్, చక్రవర్తి, అంబాల నారాయణగౌడ్, కిషోర్గౌడ్, పల్లె రవి, బాల్రాజుగౌడ్, జీవోపీఏ బండి సాయన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి జివి శ్రీనివాస్గౌడ్, రఘునాథ్గౌడ్, రామ్మోహన్గౌడ్, మీరయ్యగౌడ్, శారద గౌడ్, ఎన్.రమేశ్గౌడ్, మహేశ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.