హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఒక్క రైతునైనా ప్రభుత్వం పరామర్శించలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతాంగాన్ని పరామర్శించి ధైర్యం ఇచ్చే సత్తాలేని పిరికివాళ్లు కాంగ్రెస్ మంత్రులని ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిరంజన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సేద్యానికి ఊపిరి పోసింది ఎవరో? ఉసురు పోసుకుంటున్నది ఎవరో రైతులందరికీ తెలుసని పేర్కొన్నారు.
మ్యానిఫెస్టోలో రైతులకు ప్రకటించిన పథకాలన్నింటినీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు నిలదీస్తారన్న భయంతోనే ముఖ్యమంత్రి, మం త్రులు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులను, ప్రజలను హోల్సేల్గా మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్కు ఓటేసినందుకు రైతులు వారి చెప్పులతో వారే కొట్టుకుంటున్నారని అన్నారు. రైతుబంధు, రైతుభీమా స్కీమ్స్ తీసుకొచ్చిన కేసీఆర్ నిబద్ధతను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల వారికి కండువాలు కప్పే పనిలో బిజీగా ఉన్నారని విమర్శిం చారు. మంత్రి తుమ్మ ల పరిస్థితి చూస్తే జాలేస్తున్నదన్నారు. గతానికి, ఇప్పటికీ ఉన్న తేడా కనిపించడం లేదా? అని ప్ర శ్నించారు.
యాసంగి పంటలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై ప్రభుత్వానికి అవగాహన లేదని, నీటిని మళ్లించుకునే ఆలోచన లేదని ధ్వజమెత్తారు. ప్రకృతి విపత్తును రాజకీయం చేస్తున్నారన్న మంత్రి తుమ్మ ల, అదే కారణంతో మేడిగడ్డ బరాజ్లోని మూడు పిల్లర్లు కుంగాయన్న సంగతి తెలియదా? అని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.