హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తొంబై శాతం పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పండబెడతారా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. కొడంగల్, నారాయణ్పేట ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో సాగునీటిని అందించవచ్చని తెలిపారు. దానిని కాదని తక్కు వ నీటి లభ్యత, ఎక్కువ ఖర్చు, ఎక్కువ సమయం తీసుకునే జూరాల ఎత్తిపోతల పథకంతో నీటిని అందించాలనే నిర్ణయం పై పునరాలోచించాని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ చైర్మన్ ఏ వెంకటేశ్వరరెడ్డితో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూరాల సామర్థ్యం కేవలం 6.50 టీఎంసీలేనని, కేవలం 40 రోజులు మాత్రమే వరద ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. కేసీఆర్కు ఎక్కడ పేరొస్తుందనే భేషజాలకు పోతు న్నారని విమర్శించారు. పునరాలోచించి జూరాల నుంచి ఎత్తిపోసే నిర్ణయపై పునరాలోచన చేయాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హితవు పలికారు.