హైదరాబాద్ : సాధ్యం కానీ హమీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. బుధవారం స్పీకర్గా ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ కేటీఆర్(Former minister KTR) నామినేషన్పై సంతకం చేశారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దులపై చర్చ జరగలేదన్నారు. కాగ్ ప్రతి ఏడాది నివేదికలు ఇస్తుంది. ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నారని చెప్పారు. మేం ఏటా పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామని గుర్తు చేశారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. అలవి కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలైన ఆట అన్నారు.
రుణమాఫీపై రాహుల్ గాంధీ హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో రుణమాఫీ చేస్తామన్నారు. తొలి కేబినేట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ద, రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల కుప్ప చేశారని, రేపటి గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారన్నారు. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఎలా ఇస్తారని అడిగితే సమాధానం చెప్పడం మాత్రం లేదన్నారు.