హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బిడ్డల భవితవ్యం కోసం పోరాడేది స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ లో ఆయన మాట్లాడారు. లోకసభ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్య అన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీకి భయం పట్టుకుందన్నారు. కృష్ణా, గోదావరి జలాల పరిరక్షణ బీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్కు లబ్ధిచేకూరేలా మోదీ నిర్ణయాలు తీసుకున్నారని, ఎంపీ ఎన్నికల్లో మోదీకి లబ్ధి చేకూరేలా రేవంత్ చర్యలు ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం వైపు కన్నెత్తి చూడని కేంద్ర నిపుణుల కమిటీ ఢిల్లీలో రూపొందించిన నివేదికను బయటపెట్టడమే ఇందుకు తారాణమన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ సీఎం రేవంత్పై ఆరోపణలు గుప్పిస్తున్న ప్రధాని ఆ దిశగా ఎందుకు విచారణ జరిపించడంలేదని ప్రశ్నించారు.
తనపై కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు చెత్తమాటలని జగదీశ్రెడ్డి కొట్టిపారేశారు. సీఎం రేవంత్రెడ్డి, మరో మంత్రి ఉత్తమ్పై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ప్రజాస్వామ్యంలో అటువంటి చీడ పురుగులు ఉండటం దురదృష్టకరమన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని జగదీశ్రెడ్డి హెచ్చరించారు.