సంగారెడ్డి : హోంగార్డులు(Home Guards) అంటే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపా? హైడ్రా కూల్చివేతల సమయంలో గాయపడిన వారిని అధికారలు కనీసం పరామర్శించకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో నిర్మించిన కట్టడాలను హైడ్రా(Hydraa) కూల్చివేతలో క్రమంలో తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డు గోపా ల్ను(Home Guard Gopal) హరీశ్ రావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీస్ ఉన్నతాధికారి కూడా వచ్చి పరామర్శించలేదు. హోం గార్డులు అంటే అంత చులకనా? అని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు హోం గార్డు గోపాల్ కుటుంబం చికిత్సకి లక్ష రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదు. ప్రభుత్వం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని కుటుంబసభ్యులు వాపోతున్నారు. నాలుగు నెలల నుంచి జీతం రాక, ఇటు వైద్య ఖర్చులు భరించలేక పోతున్నాం అని కుటుం బ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తురని తెలిపారు. తలకు దెబ్బ తగిలి మాట పడిపోయింది. పూర్తిగా మాటలు రావడానికి నాలుగు నెలల పాటు స్పీచ్ థెరఫీ అందించాలని డాక్టర్లు చెప్తున్నారు. ప్రమాదకరమైన డిటోనేట ర్లతో పేలుళ్లు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గోపాల్ ప్రమాదానికి గురయ్యారని విమర్శించారు.
ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గోపాల్ని, గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గోపాల్కి పూర్తిగా నయం అయ్యేంత వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని, అలాగే గోపాల్కి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.