Harish Rao | సిద్దిపేట/కోహీర్/సంగారెడ్డి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులను వంచించిందని మాజీమంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. శుక్రవారం ట్విట్టర్లో డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలపై మండిపడ్డ హరీశ్.. సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జహీరాబాద్లో బీఆర్ఎస్ నిర్వహించిన ఈద్-మిలాప్ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్తో కలిసి పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు.
‘కాంగ్రెస్లో అబద్ధాల పోటీ కొనసాగుతున్నది. ఆ పార్టీ ఆరు గ్యారెంటీలు నూరు అబద్ధాలతో సమానం. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొనటం రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచించటమే. డిసెంబర్ 9నే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పడమే గాక, సీఎంగా తొలి సంతకం రుణమాఫీపైనే అని చెప్పిన విషయం భట్టికి తెలియనట్టు నటించటం హాస్యాస్పదం.
అబద్ధాల్లో సీఎం రేవంత్రెడ్డితో భట్టి విక్రమార పోటీ పడుతున్నారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించి అభాసుపాలైన భట్టి.. తాజాగా రుణమాఫీపై కూడా నాలుక మడతబెట్టారు. ఏరుదాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అయిపోయాక మొండి చేయి చూపిస్తున్నది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. నిన్న నిరుద్యోగభృతిపై ఎగవేత, నేడు రైతు రుణమాఫీపై దాటవేత ధోరణి.
కాంగ్రెస్ నేతల మోసాలకు సాక్షాలివిగో’ అంటూ భట్టి వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని, అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన ఆ పార్టీ ఇప్పుడు రైతులను అన్నివిధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. మారెట్లకు వడ్లు వచ్చినా ఎందుకు కొనటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గన్నీ బ్యాగ్లు అందుబాటులో లేవని, రైస్మిలర్స్ అలాంట్మెంట్ కాలేదని తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.2,203 ప్రకటించినా, 15 రోజుల నుంచి ధాన్యం కొనటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ మొద్దు నిద్ర వీడకపోవడంతో రైతులు వ్యాపారులకు తకువ ధరకు ధాన్యం అమ్ముకొని నష్టపోతున్నారని వెల్లడించారు.
వ్యాపారులకు రూ.1,800కే క్వింటాల్ ధాన్యం అమ్ముకోవటంతో రైతులు రూ.400 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 500 రూపాయలు బోనస్ ఇవ్వకపోగా, రైతులకు 400 బొక పెడుతున్నారని కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి గింజవరకు కొని మద్దతు ధర ఇచ్చామని గుర్తుచేశారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేలు, రైతుభరోసా, కౌలు రైతుకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. వరి, మకజొన్నకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కరువు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని హరీశ్ విమర్శించారు. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోనే లోటు వర్షపాతం ఉన్నదని తెలిపారు. అవసరమైతే దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, సీఎం, మంత్రులు ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. సీఎం కానీ, మంత్రలు కానీ ఒక్క రైతు కుటుంబాన్నీ పరామర్శించలేదని మండిపడ్డారు. నల్లచట్టాలు తెచ్చిన కేంద్ర బీజేపీ సర్కారు 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్రో ధరలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై మోదీ సర్కారు మోయలేని భారం మోపిందని విమర్శించారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో రైతులకు ఎడ్లు, నాగలి ఇస్తానని మోసం చేసిన బీజేపీ అభ్యర్థి రఘనందన్రావును దుబ్బాక ప్రజలు బండకేసి కొట్టారని తెలిపారు. దుబ్బాకలో చెల్లని వ్యక్తి మెదక్లో ఎలా చెల్లుతాడు? అని ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీలు రైతుల పాలిట శాపాలుగా మారాయని విమర్శించారు. ఈ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని రైతులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేదాకా పోరాటం చేయాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు పిలుపనిచ్చారు. రైతు వడ్ల కల్లాల వద్దకు వెళ్లాలని, సీఎంకు పోస్ట్ కార్డు రాసి పంపాలని సూచించారు. ప్రతి గ్రామంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టి రైతులకు అండగా నిలవాలని చెప్పారు. కొనుగులు కేంద్రాలు ప్రారంభించాలని రెవెన్యూ అధికారులను అడగాలని, లేనిపక్షంలో రైతులకు అండగా రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని మైనార్టీలు కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీకి ఉపయోగపడుతుందని, బీఆర్ఎస్కు ఓటు వేస్తేనే వారికి భద్రత ఉంటుందని హరీశ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయాయని, ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, ఆయన రాజకీయ పునాదులు ఆరెస్సెస్లో ఉన్నాయని విమర్శించారు. రేవంత్రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, రేవంత్ ఎజెండా, రాహుల్గాంధీ ఎజెండా వేర్వేరు అని తెలిపారు. మైనార్టీలను రేవంత్ తన మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రంజాన్ తోఫాలను ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కేసీఆర్ హయాంలో అన్ని మతాల ప్రజలు సామరస్యంతో జీవించారని గుర్తుచేశారు. కరీంనగర్, వరంగల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్లో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్ సహకరిస్తున్నదని ఆరోపించారు. సెక్యులరిజాన్ని కాపాడాలంటే ఎంఐఎం సైతం బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు.