హైదరాబాద్ : అకాల వర్షానికి(Rain) పంటలు దెబ్బతిన్న(Damaged crops) రైతలుకు నష్టపరిహారంతోపాటు రైతు బంధు డబ్బులు వెంటనే వేయాలని సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Former minister Errabelli) డిమాండ్ చేశారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంట తండా, హరిజన కాలనీల్లో పంట నష్టపోయిన మామిడి పంటలు సందర్శించారు.
పిడుగు పాటుకు గురై అరూరి రమేశ్కు చెందిన 10గొర్రెలు మృతి చెందడడంతో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రైతులపై ప్రేమ ఉంటే తక్షణమే తుమ్మల నాగేశ్వర్రావు రైతుబంధు వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. రైతాంగానికి పంట నష్ట పరిహారం, రైతుబంధు డబ్బులు వేస్తే బీఆర్ఎస్ పక్షాన అడ్డుకోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని సూచించారు.
సీఎం రేవంత్రెడ్డివి ఓట్ల రాజకీయాలు తప్పా రైతులపై ప్రేమ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమయ్యారని ఆరోపించారు. సాగు నీరు లేక పంటలు ఎండిపోయాయని ధ్వజమెత్తారు. అకాల వర్షంతో రైతులు పంటలు నష్టపోయారని చెప్పారు. అకాల వర్షానికి దెబ్బతిన్న వరి మామిడి పంటలకు ఎకరానికి రూ.15వేల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి రూ.10వేలు సీఎం కేసీఆర్ వేశారని గుర్తు చేశారు.