ఆదిలాబాద్/హైదరాబాద్, జూలై 20(నమస్తే తెలంగా ణ): కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గా పనిచేసిన చిల్కూరి రామచంద్రారెడ్డి (80) కన్నుమూశా రు. అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి పంచాయతీ సమితి ప్రెసిడెంట్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభిం చారు. ఆదిలాబాద్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈయనకు భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు.
ప్రజాదరణ పొందిన నేత రామచంద్రారెడ్డి: సీఎం కేసీఆర్
చిల్కూరి రామచంద్రారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం తెలిపారు. ఆదర్శవంతమైన రాజకీయాలతో ప్రజాదరణ పొందిన నేతగా ఆయన అందించిన స్ఫూర్తి గొప్పదని కొనియాడారు. చిల్కూరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రామచంద్రారెడ్డి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా చిల్కూరి మృతి పట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న సంతాపం తెలిపారు.