హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను నిర్ణయించాలి, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్కు ప్రతిపాదనలు పంపాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
కృష్ణా నదిపై కేఆర్ఎంబీ, గోదావరి నదిపై జీఆర్ఎంబీ ఏర్పాటుచేసి 107 ప్రాజెక్టులను తన పరిధిలోకి తీసుకొని, మన నదీ జలాలపై కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తున్నదని ఆరోపించారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే గాదరి కిషోర్ బలపరిచారు. తమకు రావాల్సిన వాటాను బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్కు ప్రతిపాదించాలని డిమాండ్ చేశారు.