చేర్యాల, మార్చి 6 : కొమురవెల్లి( Komuravelli )శ్రీ మల్లికార్జున స్వామి(Mallanna temple) వారిని భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్(MSK Prasad) బుధవారం దర్శించుకున్నారు. మల్లన్న దర్శనానికి వచ్చిన మాజీ క్రికెటర్కు మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు తాళ్లపల్లి రమేశ్, అల్లం శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్లు స్వాగతం పలికారు. అనంతరం మల్లన్న ఆలయంలో స్వామి వారిని ఎంఎస్కే ప్రసాద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. తన మిత్రుని ద్వారా కొమురవెల్లి మల్లన్న ఆలయ వివరాలు తెలుసుకుని దర్శనం కోసం వచ్చినట్లు తెలిపారు. ఆలయం చాలా బాగుందని అన్నివర్గాల ప్రజలు స్వామి వారిని దర్శించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జై వాసవి, ఆర్జే గ్రూప్స్ చైర్మన్ భాస్కర్రాం గుప్తా, బండ్ల వేణు, బాలగోని రాజు, అవుశెర్ల కిశోర్ తదితరులున్నారు.