హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని, నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించారని తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ముఖ్యమంత్రి అయ్యాకే ఎలక్ట్రిక్ వా హనాల విషయంలో నిర్ణయం తీసుకున్నట్టు అసెంబ్లీలో రేవంత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా అప్పటి బీఆర్ఎస్ ప్ర భుత్వం రిజిస్ట్రేషన్ చేసిందని, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని కొనసాగిస్తున్నదే తప్ప కొత్తగా చేసిందేమీ లేదంటూ చురకలు అం టించారు.