హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): క్యాబినెట్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తామని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడాన్ని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఖండించారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిత్రాలను తొలిగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్లో టీఎస్టీఎస్సీ మాజీ చైర్మన్ చిరుమల్ల రాజేశ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరిక చిహ్నాలని సీఎం హోదాలో రేవంత్రెడ్డి మాట్లాడటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కాకతీయులు రాచరిక వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్లు కాదని, పేదల కోసం పని చేసిన వారని చెప్పారు. తెలంగాణ వచ్చాక పదేండ్లలో కేసీఆర్ చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశారని పేరొన్నారు. కాకతీయులు అణగారిన బీసీ కులానికి చెందిన వారుగా చరిత్రకారులు చెప్తుంటారని తెలిపారు. 800 ఏండ్ల కాకతీయుల చరిత్రకు నిదర్శమైన కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తామమంటూ సీఎం ఆలోచన లేకుం డా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సారనాథ్ స్థూపంపై ఉన్న మూడు సింహాలు, అశోక చక్రం చిహ్నాలను భారతదేశ చిహ్నంలో తీసుకున్నారని, మరి అవి రాచరిక వ్యవస్థకు సంకేతం కాదా అని వినోద్కుమార్ ప్రశ్నించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయాన్ని, తెలంగాణ భాషను, యాస ను, తెలంగాణ చరిత్రను తుడిచివేయాలని ఆంధ్రపాలకులు అనుకున్నారని గుర్తుచేశారు. సీఎం తీరును చూస్తుంటే తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలని భావిస్తున్నట్టున్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఇంకా రేవంత్లో టీడీపీ లక్షణాలు పోయినట్టు అనిపించడం లేదని విమర్శించారు. కాకతీయులు పాలించిన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ, సీతక మంత్రులుగా ఉన్నారని, సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు స్పందించాలని డిమాండ్ చేశారు.