చండ్రుగొండ, నవంబర్ 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న గొత్తికోయలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అటవీ శాఖ అధికారులు ఆదివారం వారికి నోటీసులు జారీ చేశారు. ఎఫ్డీవో అప్పయ్య చండ్రుగొండ రేంజ్ పరిధిలోని అటవీశాఖ సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అటవీహక్కుల చట్టం ప్రకారం.. గొత్తికోయలు అటవీ ప్రాంతంలో నివసించే హక్కులేదని ఎఫ్డీవో పేర్కొన్నారు.