హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అటవీశాఖ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపయ్యిందని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ అరణ్యభవన్లో శుక్రవారం సీఎం కేసీఆర్కు ధన్యవాద సభ నిర్వహించారు. రమణారెడ్డి మాట్లాడుతూ.. అటవీశాఖ అధికారులు విధి నిర్వహణలో అంసాఘిక శక్తుల చేతిలో హతమైనా, ప్రాణాపాయంతో బయటపడినా రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు పరిహారం అందించాలని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్నారు.
అటవీ అధికారులకు తుపాకులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. దీంతో అధికారుల భద్రతపై మరింత భరోసా కలుగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్తోపాటు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ డోబ్రియల్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్కు అటవీ శాఖ అధికారులు ఎంతో రుణపడి ఉంటారని తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నరేందర్ చెప్పారు.