బెల్లంపల్లి, మార్చి 16 : లక్షన్నర మందికి పోడు వ్యవసాయ పట్టాలు అందిస్తామని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి విస్తృతంగా పర్యటించారు. కన్నెపల్లి మండలంలో రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
నెన్నెల మండల కేంద్రంలో తునికాకు కూలీలు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు, మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. మైలారం-దుబ్బపల్లి గ్రామాలకు రూ.1.50 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ.. బెల్లంపల్లి వంద పడకల దవాఖానలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీసస్కిటేషన్) అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరోనా తర్వాత గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో సీపీఆర్ పద్ధతిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతంగా పురోగమిస్తుంటే.. ఓర్వలేని ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? ప్రశ్నించారు.