శంషాబాద్ రూరల్, అక్టోబర్ 16: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం విదేశీ కరెన్సీ పట్టుబడింది. దోహ నుంచి ఎయిర్ఇండియా విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని సోదాచేయగా.. విదేశీ కరెన్సీ 49.999 (ఖతార్) రియాల్ లభించాయి. దీని విలువ రూ.9.84 లక్షలు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.