Telangana | హైదరాబాద్ : తెలంగాణలోని పలు గురుకుల విద్యాలయాల్లో పిల్లలు అస్వస్థతకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఫుడ్ పాయిజన్ కారణంగా గత 50 రోజుల్లో 135 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భువనగిరి గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి ప్రశాంత్ మృతి చెందాడు. అయినప్పటికీ ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఎక్కడ..? అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు మేల్కొనే ఉన్నారా? అని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు అడుగుతున్నారు.
1. భువనగిరి గురుకుల హాస్టల్లో కల్తీ ఆహారంతో 40 మంది విద్యారులకు వాంతులు, విరేచనాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ అనే విద్యార్థి మృతి.
2. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గురుకుల హాస్టల్లో 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.
3. నిర్మల్ జిల్లా నర్సాపూర్ కేజీబీవీ గురుకుల హాస్టల్లో కల్తీ ఆహారంతో 20 మంది విద్యార్థులు అస్వస్థత (ఏప్రిల్ 4, 2024).
4. నల్గొండ జిల్లా నేరేడుచర్ల గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో నలుగురు విద్యార్థులు ఆస్పత్రి పాలు.
5. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గురుకుల హాస్టల్లో కల్తీ ఆహారంతో 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.
6. నిర్మల్ జిల్లా నర్సాపూర్ కేజీబీవీ గురుకుల హాస్టల్లో 11మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ (19/04/2024).