హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి, డాక్టర్లపై దాడులను అరికట్టేలా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్డీఏ) ప్రతినిధులు శనివారం డీజీపీ అంజనీకుమార్ను కలిసి వినతిపత్రం అందించారు.
కొందరు డాక్టర్లపై అకారణంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు. డీజీపీని కలిసినవారిలో డాక్టర్లు బీఎన్ రావు, నర్సింగరెడ్డి, అజయ్రావు, సంపత్రావు, రాజేంద్రకుమార్ యాదవ్, కత్తి జనార్దన్, పూర్ణచందర్ ఉన్నారు.