SRSP | నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్సారెస్సీ వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 92,590 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,076.10 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 42.452 టీఎంసీలు.