శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుండి వరద నీరు వచ్చి చేరుతూనే ఉంది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు నుండి 2,43,127 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 28,718 క్యూసెక్కులు, సుంకేశుల నుండి 42,070 క్యూసెక్కుల ( మొత్తం 3,13,965 క్యూసెక్కులు ) నీరు శ్రీశైలానికి వచ్చి చేరింది. కాగా శుక్రవారం సాయంత్రం వరకు 3,10,689 క్యూసెక్కుల ఇన్ఫ్లో రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తు ఎత్తి 3,17,460 క్యూసెక్కులను, కుడి ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 50,877 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్కు విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఏంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 212.4385 టీఏంసీలుగా నమోదైంది.