శ్రీశైలం : ఎగువ నుంచి వస్తున్న భారీ వరదకు శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు ఒక్క గేటును 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సంవత్సరం క్రస్ట్ గేట్లు ఎత్తడం ఇది రెండోసారి అని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
గురువారం ఉదయం జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 28,469 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 41,937, సుంకేశుల నుండి 1,24,504, హంద్రీ నుండి 250 క్యూసెక్కులు మొత్తం కలిపి 1,95,160 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సాయంత్రం ఆరు గంటల వరకు రిజర్వాయర్కు 2,21,546 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుకున్నాయి. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.10 అడుగులకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 210.5133 టీఎంసీల నీరు ఉంది.