శ్రీశైలం : కృష్ణా నది ఎగువ పరీవాహక పాంత్రాల్లో భారీగా వర్షాలు కురవడం వల్ల శ్రీశైలం జలాశయానికి వరద వరద ప్రవాహం పెరుగుతుంది. బుధవారం ఉదయం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 44,047 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 1,28,985, హంద్రీ నుండి 250 క్యూసెక్కుల నీరు విడదల కాగా సాయంత్రానికి జలాశయానికి 76,122 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా నమోదయింది.
అదే విధంగా ఏపీ పవర్హౌస్లో 32,101, టీఎస్ పవర్హౌస్లో 31,784 క్యూసెక్కుల నీటితో విద్యుదోత్పత్తి చేసుకుని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 199.2737 టీఎంసీలుగా ఉన్నాయి.