సంగారెడ్డి : ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు 12వేల క్యూసెక్కుల వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు 15వ నెంబర్ గేటును 1.5 మీటర్లు పైకెత్తి 12,997 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 29.224 టీఎంసీలు. ఇక దిగువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో మంజీరా లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు.