ఎడతెరపిలేని భారీ వర్షాలతో ప్రాణహితకు పోటెత్తిన వరద శుక్రవారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. 5.50 లక్షల క్యూసెక్కుల నుంచి 5.30 లక్షల క్యూసెక్కులకు తగ్గగా, 65 గేట్లను ఎత్తి లక్ష్మీబరాజ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పడుతున్నది.
43 మీటర్లకుపైగా ప్రవహించిన గోదావరి 41.50 మీటర్లకు తగ్గిపోయింది. అటు కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతిని కొనసాగుతుండగా, 4 గేట్లను తెరిచి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.