మంచిర్యాల : జిల్లాలో రెండురోజులుగా తెరిపిలేకుండా వాన కురుస్తున్నది. జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం20.18 టీఎంసీలు కాగా, 19.51 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో 35 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నీల్వాయి రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 124 మీటర్లు కాగా, ప్రస్తుతం123 మీటర్లు ఉంది.
ప్రాణహిత, గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పరిసర ప్రాంతప్రజలు అటువైపుగా వెళ్లవద్దని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. కోటపల్లి, చెన్నూర్, జన్నారం, నెన్నెలతో పాటు పలు మండలాల్లో వాగులు ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లాలోని శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, కేకే, ఆర్కే ఒపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
ఇవి కూడా చదవండి..
నిర్మల్ వర్ష ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా
ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!
గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్రావు