శంషాబాద్ రూరల్, జనవరి 17: దట్టమైన పొగమంచు కారణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన, ఇక్కడికి రావావాల్సిన తొమ్మిది విమాన సర్వీసులను బుధవారం ఉదయం అధికారులు రద్దు చేశారు. దట్టమైన పొంగమంచు కమ్ముకోవడంతో కనీసం 200 మీటర్ల దూరంలో ఏమి ఉన్నదో కూడా కనిపించకపోవడంతో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.
కోల్కతా, ముంబై వెళ్లాల్సిన విమానాలు.. బెంగళూరు, చెన్నై, రాజమండ్రి, గన్నవరం ఎయిర్పోర్టు నుంచి రావాల్సిన విమాన సర్వీసులను క్యాన్సిల్ చేసినట్టు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. పొగమంచు కారణంగా విమాన రాకపోకలు అలస్యమవుతున్నాయని వెల్లడించారు.