Road Accident | నల్లగొండ : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి – అద్దంకి హైవేపై కృష్ణానగర్ కాలనీ బైపాస్ వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. వెనుకాలే వేగంగా దూసుకొచ్చిన లారీ, ఆ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన దంపతులు మహేశ్(35), జ్యోతి(30), వీరి కుమార్తె ఇషిత(5), తండ్రీకుమారులు మశ్చేంద్ర(38), లియాన్స్(2)గా గుర్తించారు. విజయవాడలో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.