Accident | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండల పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. చర్లపల్లి గ్రామ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆప్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కండక్టర్ కూడా ఉన్నారు. గ్రామ సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పడంతో బోల్తా పడినట్లు పోలీసులు నిర్ధారించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.