హైదరాబాద్: వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం దాస్తండా సమీపంలో బైక్ను బొగ్గు లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులను ఎర్రాయిగూడెంకు చెందిన హనుమంతు, ఈసం స్వామిగా గుర్తించారు.
వరంగల్లోని ఖమ్మం బైపాస్ హంటర్ రోడ్డు ఫ్లై ఓవర్పై రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో ఫ్లైపైనుంచి ఓ కారు కిందపడిపోయింది. దీంతో ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరొకరు దవాఖానలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడ్డారు. అతడిని పోలీసులు ఎంజీఎం దవాఖానకు తరలించారు. మృతిచెందిన వారిని ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సారయ్య, ఆయన భార్య సుజాతగా గుర్తించారు.
ఇక మేడ్చల్ జిల్లా సూరారం వద్ద కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం.. లారీ ఢీకొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ మరణించాడు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ మూడు ఘటనలపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.