నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. టాస్క్ఫోర్స్ బృందం దాడులు జరిపి.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ నాగరాజు వెల్లండించారు. వీక్లీ మార్కెట్లో కొందరు వ్యక్తులు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్ మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించి, నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద రూ.8,550, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితులను పట్టుకొని వన్టౌన్ పోలీస్స్టేషన్ అప్పగించారు. పట్టుబడిన వ్యక్తులను షాకీర్ ఖురేషి, భోగి నవీన్, గంట అవినాష్, ఎండీ నవీద్గా పోలీసులు గుర్తించారు.