సూర్యాపేట : మత్స్యకార వృత్తిని(Fishermen) ప్రోత్సహించి మా జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్(BRS) వైపే మా ప్రయాణం అంటూ సూర్యాపేటలో మత్స్యకారులు తేల్చిచెప్పారు. తెలిసో తెలియక బీఎస్పీలోకి వెళ్లిన తాము తిరిగి బీఆర్ఎస్ పార్టీ లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. సూర్యాపేటలోని 13వ వార్డ్ గాంధీనర్కు చెందిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు బీఎస్పీకి రాజీనామా చేసి మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరారు.
విద్యానగర్లోని పార్టీ కార్యాలయం వద్ద గులాబీ కండువాలు కప్పి మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బంటు మారయ్య, దువ్వ మల్లేష్, గోడదాటి సైదులు, దాసరి ఉప్పలయ్య, తిరుపతి రవి, మొర రామచంద్రు, చెన్నబోయిన అంజయ్య, లక్ష్మయ్య, బుచ్చి బాబు తో పాటు వంద మంది మత్స్యకారులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో13 వార్డు అధ్యక్షుడు రఫీ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.