హైదరాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): 45 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు మత్స్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ రమేశ్, ప్రధాన కార్యదర్శి బీ ఏసుదాస్ మంగళవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ సూచన మేరకు సమ్మె విరమించినట్టు తెలిపారు. మం త్రుల నివాసంలో వినోద్కుమార్తో రాష్ట్ర మత్స్య సహకార సమాఖ్య చైర్మన్ పిట్టల రవీందర్, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మత్స్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమావేశమయ్యారు. వారి సమస్యలను తెలుసుకున్న వినోద్కుమార్ మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాతో మాట్లాడారు. అనంతరం మం త్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, హరీశ్రావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించి డిమాండ్ల పరిషారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమ్మె విరవిస్తున్నట్టు ఉద్యోగులు ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు ఎన్ కిరణ్కుమార్, రాష్ట్ర నాయకులు ఏ శ్రీకన్య, గౌతమి, శ్రీకాంత్, రాజ్కుమార్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.