టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటుడు ఫిష్ వెంకట్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో వెంకట్ మొక్కలు నాటి, సెల్ఫీ దిగారు.
ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భావితరాలకు ఉపయోగపడే కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్కు ఫిష్ వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు.