నల్లగొండ : వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి, అంతిమంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఆరో విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా నకేరేకల్ లోని పెద్ద చెరువులో మంత్రి జగదీష్ రెడ్డి చేప పిల్లలను వదిలారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ వృత్తుల అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించారని, అందులో భాగంగానే కుంచించుకుపోయిన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. వాటిల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మున్సిపల్ చైర్మన్, మత్స్య సహకార సభ్యులు పాల్గొన్నారు.