భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 9 గంటలకు గోదావరి నీటి ప్రవాహం 42.1 అడుగులుగా నమోదయింది. కాగా, ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 43 అడుగులకు కంటే తక్కువగా ఉండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.