హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఫేక్ సర్టిఫికెట్లను అడ్డుకట్టవేసేందుకు అమలుచేస్తున్న స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ (ఎస్ఏవీఎస్) పోర్టల్ విజయవంతమైంది. ఒకేఒక్క క్లిక్తో సర్టిఫికెట్లు అసలువో.. నకిలీవో దీని ద్వారా తెలిసిపోతున్నది. కార్పొరేట్ కంపెనీలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, హెచ్ఆర్ మేనేజర్లు రాష్ట్రంలోని ఏ అభ్యర్థి సర్టిఫికెట్ను పరిశీలించాలన్నా ఎస్ఏవీఎస్ పోర్టల్నే ఆశ్రయిస్తున్నారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా చెలరేగుతున్న ఫేక్ సర్టిఫికెట్ల ముఠాలకు అడ్డకట్ట వేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నకిలీ విత్తనాలను అరికట్టడంలో సక్సెస్ సాధించినట్టుగానే.. నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేయడానికి కేసీఆర్ ఆలోచనల మేరకు 2022 నవంబర్లో ఎస్ఏవీఎస్ పోర్టల్ను ప్రారంభించారు. 2001 నుంచి 2023 వరకు రాష్ట్రంలోని 15 వర్సిటీల్లోని 25 లక్షల మంది విద్యార్థుల సమాచారాన్ని ఈ పోర్టల్లో నిక్షిప్తంచేశారు.