అచ్చంపేటటౌన్/శ్రీశైలం/ హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ సమీపంలోని లలితాంబికా వాణిజ్య సముదాయంలోని ఒక బ్లాక్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఇలా ఒక్కో షాపునకు మంటలు వ్యాపించి సుమారు 14 దుకాణాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పా రు. అప్పటికే రూ.లక్షల విలువైన వస్తు సామగ్రి, ప్రసాదాలు కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు దుకాణాదారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకొని దుకణాలను పరిశీలించారు. తక్షణ ఆర్థిక సాయం కింద ఒక్కో దుకాణాదారుడికి రూ.20
వేలు అందజేశారు.