ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు మంటలు వ్యాపించి 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనగ కుంటలో గురువారం సాయంత్రం జరిగింది.
ఈదురుగాలుల వల్ల అటవీప్రాంతంనుంచి మంటలు గ్రామానికి వ్యాపించాయి. దీంతో గ్రామంలోని 40 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. కాగా, తమను ఆదుకోవాలంటూ గిరిజనులు కోరుతున్నారు.