Nallagonda | నల్లగొండ : మిర్యాలగూడ మండలం కొత్తసామ్య తండాలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.
ఈ సందర్భంగా బాధితుడు హనుమ నాయక్ మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగినట్లు పేర్కొన్నాడు. అగ్నికీలలు ఎగిసిపడిన సమయంలో ఇంట్లో రూ. 5 లక్షల నగదు, ఏడు తులాల బంగారం ఉన్నట్లు తెలిపాడు. నగదు పూర్తిగా కాలి బూడిద అయిందని హనుమ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.