సిద్దిపేట: సిద్దిపేట సర్కార్ దవాఖానలో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దవాఖానలోని ఐసోలేషన్ వార్డులో (Isolation ward) మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు గురైన రోగులు, హాస్పిటల్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఐసోలేషన్ వార్డులోని వైద్య పరికరాలు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. షాట్ సర్క్యూట్ (Short Circuit) వల్లే ప్రమాదం సంభవించిందని తెలిపారు.