బజార్ఘాట్: నాంపల్లిలోని బజారఘాట్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదు అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది దుర్మరణం పాలయ్యారు. వారిలో కొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంటల్లో మరికొంత మంది చిక్కుకుని ఉన్నారు. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అపార్టుమెంటు ముందు పార్క్ చేసి ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలు కూడా ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. అపార్టుమెంటులోని 15 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. కొంతమందికి దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఓ గ్యారేజీ ఉన్నదని, ఆ గ్యారేజీలో కారును రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని స్థానిక డీసీపీ తెలిపారు. గ్యారేజీలోనే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకుని అపార్టుమెంటు పైఅంతస్థులకు ఆ మంటలు చెలరేగాయని, అపార్టుమెంటు మూడు, నాలుగో ఫ్లోర్లలో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయని చెప్పారు.
#WATCH | Six people have died in a fire at a godown located in an apartment complex in Bazarghat, Nampally of Hyderabad, says DCP Venkateshwar Rao Central Zone. pic.twitter.com/sXepmTPB2f
— ANI (@ANI) November 13, 2023