చేగుంట : మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. గ్రామానికి చెందిన, పిట్టల అంజమ్మ (59)తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటుంది. నిన్న మనవరాలు మధు (6)తో కలిసి పెన్షన్, రేషన్ బియ్యం కోసం గ్రామానికి వచ్చింది.
అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం రావడంలో భయాందోళనకు గురుయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు గ్రామస్తులు, ఫైరింజన్ సహాయంతో మంటలు ఆర్పివేసినా ఫలితం లేకుండా పోయింది. మంటల్లో అంజమ్మతో పాటు తన ఆరు సంవత్సరాల మనవరాలు మధు సజీవ దహనం అయ్యారు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.