హైదరాబాద్: నగరంలోని సనత్నగర్ ఈఎస్ఐ (ESI) దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హాస్పిటల్లోని మెడికల్ డిస్పెన్సరీ గోదాములో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి గోడౌన్ అంతటా విస్తరించాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో గోదాము మొత్తం కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని, రూ.కోటికిపైగా విలువచేసే మందులు కాలిపోయాయని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.