నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు రాజుకున్నది. మన్ననూరు, అమ్రాబాద్ రేంజ్లో మంగళవారం అడవి అగ్నికి ఆహుతైంది. అక్కమహాదేవి, బిళం, వటువర్లపల్లి, ఈగలపెంట, ఫరహాబాద్ సౌత్బీట్, తుర్కపల్లి, బోరేటిబావి తదితర 15 ప్రాంతాల్లో మంటలు అంటుకున్నాయని అటవీ రేంజ్ అధికారి ప్రభాకర్ తెలిపారు.
70 మంది ఫారెస్ట్ అధికారులు, ఫైర్ వాచర్లు, క్విక్రెస్పాన్స్, ఇతర బృందాలు మంటలను ఆర్పేశాయి. శ్రీశైలం వెళ్తున్న భక్తులు, .చొరబాటుదారుల కారణంగా ఈ మంటలు అంటుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
– అమ్రాబాద్