హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు సవరణకు, నూతన ఓటు నమోదుకు గడువు ముగిసేనాటికి మొత్తంగా 11,99,850 లక్షల దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారంతో దరఖాస్తు గడువు ముగియగా, కొత్తగా ఓటు నమోదుకు 7.69 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఓట్ల తొలగింపునకు 2,90,123, ఓట్ల సవరణకు 1,40,679 దరఖాస్తులు అందా యి.
2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయసున్న యువతకు ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ చేపట్టింది. దరఖాస్తుల విచారణ అనంతరం తుది జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటిస్తారు. ఈ జాబితా ఆధారంగా వచ్చే లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.