హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ నెల 4న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై తుది విచారణ జరుపనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై మధ్యాహ్నం 12 గంటలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను ప్రశ్నించనున్న స్పీకర్.. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధ్యాహ్నం 1 గంటకు దానం నాగేందర్పై స్పీకర్ విచారణ జరుపనున్నారు.