వేములవాడ : వేములవాడ(Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి( Rajanna Temple) వారిని ప్రముఖ సినీ నటుడు సుమన్( Suman) సోమవారం దర్శించుకున్నారు. స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొన్న అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించారు. ఆలయ ఏఈఓ శ్రీనివాస్ స్వామివారి ప్రసాదం అందజేశారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ..రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అత్యంత మహిమగల పుణ్యక్షేత్రమని అన్నారు. అందుకే ప్రతినిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కోరుకున్నానని సుమన్ తెలిపారు.